వికారాబాద్, వెలుగు: గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు మోమిన్పేట మండలంలోని కోలుకుంద సర్పంచ్ కరుణం కీర్తి రామకృష్ణ గ్రామస్తుల సమస్యలు తెలుసుకునేందుకు గడప గడపకూ సర్పంచ్కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. సోమవారం ఉప సర్పంచ్మహేందర్రెడ్డి, వార్డు సభ్యులతో కలిసి ఇంటింటికీ వెళ్లి విద్యుత్, నీరు, డ్రైనేజీ తదితర సమస్యలను నోట్ చేసుకున్నారు. ప్రతీ నెల 3 రోజులు ఈ కార్యక్రమం నిర్వహిస్తామని, ఎన్నికల్లో ఇచ్చిన ప్రతీ హామీని నెరవేరుస్తామని పేర్కొన్నారు.
