మెదక్ జిల్లాలో కాంగ్రెస్ లో చేరిన సర్పంచ్ లు

మెదక్ జిల్లాలో  కాంగ్రెస్ లో చేరిన సర్పంచ్ లు

మెదక్​, వెలుగు: ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్​మద్దతుతో పోటీచేసి గెలుపొందిన పలువురు సర్పంచ్​లు శుక్రవారం కాంగ్రెస్​ పార్టీలో చేరారు. హవేలీ ఘనపూర్​ మండల జక్కన్నపేట సర్పంచ్​ చామంతుల సత్యనారాయణ, పోచంరాల్​ సర్పంచ్​ రాజు, వార్డు మెంబర్లు, అనుచరులతో కలిసి హైదరాబాద్​ తరలివెళ్లి కాంగ్రెస్​ రాష్ట్ర నాయకుడు, మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు​ సమక్షంలో కాంగ్రెస్​లో చేరారు. 

బీఆర్ఎస్​పార్టీకి చెందిన నిజాంపేట మండలం చల్మెడ గ్రామ ఉప సర్పంచ్, ఆలయ కమిటీ మాజీ చైర్మన్​ మహేందర్​ రెడ్డి, పలువురు వార్డు మెంబర్లు హన్మంతరావు సమక్షంలో కాంగ్రెస్​లో చేరారు. కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు ఆంజనేయులు గౌడ్, కాంగ్రెస్​ నాయకులు అరునార్తి వెంకటరమణ, ఉప్పల రాజేశ్, రాగి అశోక్, చల్మెడ సర్పంచ్​ మల్లేశం పాల్గొన్నారు.