మమ్మల్ని మాస్ ​ప్రమోట్ చేయండి

మమ్మల్ని మాస్ ​ప్రమోట్ చేయండి
  • మాస్ ​ప్రమోట్ చేయాలని ధర్నా
  • శాతవాహన యూనివర్సిటీ విద్యార్థుల ధర్నా

జమ్మికుంట, వెలుగు: శాతవాహన యూనివర్సిటీ పరిధిలోని విద్యార్థులందరినీ మాస్​ప్రమోట్ ​చేయాలని డిమాండ్ ​చేస్తూ కరీంనగర్​జిల్లా జమ్మికుంటలో విద్యార్థి సంఘాలు సోమవారం ధర్నా నిర్వహించాయి. టౌన్​లోని పలు కాలేజీల స్టూడెంట్లు ఆందోళనకు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఏబీవీపీ కార్యదర్శి గట్టు సాయిరాం, ఎన్ఎస్ యూఐ జిల్లా కో-ఆర్డినేటర్ పర్లపల్లి నాగరాజు మాట్లాడుతూ.. శాతవాహన యూనివర్సిటీ పరిధిలోని కాలేజీల్లో సిలబస్​ పూర్తికాకపోయినా ఎగ్జామ్స్​ నిర్వహించాలనుకోవడం బాధకారమన్నారు. వర్సిటీ అధికారులు పరీక్షల పేరుతో విద్యార్థులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. ఓయూ, కేయూలు సెల్ఫ్ సెంటర్లు పెడుతుంటే శాతవాహన మాత్రం విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటోందని ఆవేదన వ్యక్తం చేశారు. కరోనా థర్డ్ వేవ్​ని దృష్టిలో పెట్టుకుని ప్రతిఒక్కరినీ ప్రమోట్ చేయాలని కోరారు. లేకుంటే సెల్ఫ్ సెంటర్లలో డిగ్రీ పరీక్షలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల ధర్నాతో భారీగా ట్రాఫిక్​ నిలిచిపోయింది. పోలీసులు బలవంతంగా ఆందోళనకారులను అక్కడి నుంచి తరలించారు. తోపులాటలో గట్టు సాయిరాం స్పృహ కోల్పోయాడు. ఈ కార్యక్రమంలో ఏబీవీపీ, ఎన్ఎస్ యూఐ నాయకులు గణపతిరెడ్డి, శ్రీకాంత్, శ్రీనాథ్, వికాస్, అజయ్, మహమ్మద్ సజ్జు, రత్నాకర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.