మంత్రి వివేక్ ను కలిసిన ఎమ్మెల్యే రాగమయి

మంత్రి వివేక్ ను కలిసిన ఎమ్మెల్యే రాగమయి

సత్తుపల్లి, వెలుగు :  మైనింగ్, కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామిని సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి బీఆర్​కే భవన్ లో బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. తాజాగా మంత్రివర్గంలో చేరి ప్రమాణ స్వీకారం చేసిన వివేక్ వెంకటస్వామిని ఆమె ఘనంగా సత్కరించి, అభినందనలు తెలిపారు.

 ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నియోజకవర్గ అభివృద్ధికి సహకరించాలని మంత్రిని కోరినట్లు తెలిపారు. అనంతరం వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరావును కలిసి సత్తుపల్లి, కల్లూరు మార్కెట్ యార్డ్ ల్లో విశ్రాంతి భవనాలను ఏర్పాటు చేయాలని వినతిపత్రం అందజేశారు. 

పాల్వంచ :  గడ్డం వివేక్ వెంకట స్వామికి పాల్వంచకు చెందిన మాల విద్యుత్ ఉద్యోగుల సంఘం జాతీయ అధ్యక్షుడు బూర్గుల విజయభాస్కరరావు (బాచి) శుభాకాంక్షలు తెలిపారు. హైదరాబాద్ లో మంత్రిని  కలిసి జ్ఞాపికను బహుకరించారు. ఆయన తోపాటు పెద్దపెల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణను శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో జాతీయ మాల మ హానాడు అధ్యక్షుడు జి.చెన్నయ్య, నాయకులు బూర్గుల వెంకటేశ్వర్లు, శ్రీధర్, రాజేశ్, టింకు భయ్యా, కార్తీక్, వరుణ్ ప్రసాద్ ఉన్నారు.