
సింగపూర్: ఇండియా టాప్ షట్లర్లు సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ షెట్టి.. ఈ సీజన్లో తొలి టైటిల్కు రెండు అడుగుల దూరంలో నిలిచారు. సింగపూర్ ఓపెన్లో భాగంగా శుక్రవారం జరిగిన మెన్స్ డబుల్స్ క్వార్టర్ఫైనల్లో వరల్డ్ 27వ ర్యాంకర్లు సాత్విక్–చిరాగ్ 21–17, 21–15తో వరల్డ్ నంబర్వన్ జోడీ గోహ్ జీ ఫీ–నుర్ ఇజుద్దీన్ (మలేసియా)పై సంచలన విజయం సాధించారు. గత కొన్ని వారాలుగా ఫిట్నెస్ సమస్యలతో ఇబ్బందిపడ్డ ఇండియన్ ద్వయం 39 నిమిషాల పాటు జరిగిన ఈ మ్యాచ్లో మాత్రం బలమైన డిఫెన్స్తో అద్భుతంగా ఆడింది. సాత్విక్ జంటకు ఈ ఏడాది ఇది మూడో సెమీస్ కావడం విశేషం. మలేసియా, ఇండియా ఓపెన్లోనూ సెమీస్ చేరారు. శనివారం జరిగే సెమీఫైనల్లో సాత్విక్–చిరాగ్.. అరోన్ చియ్–సో వుయ్ యిక్ (మలేసియా)తో తలపడతారు.