
యోసు (కొరియా): ఇండియా స్టార్ షట్లర్లు సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ షెట్టి సూపర్ ఫామ్తో వరుస టైటిళ్లు కొల్లగొడుతున్నారు. తాజాగా కొరియా ఓపెన్ సూపర్–500 టైటిల్ గెలిచి ఈ ఏడాది నాలుగో ట్రోఫీని ఖాతాలో వేసుకున్నారు. ఆదివారం జరిగిన మెన్స్ డబుల్స్ ఫైనల్లో వరల్డ్ మూడో ర్యాంకర్స్ సాత్విక్–చిరాగ్ 17–21, 21–13, 21–14తో వరల్డ్ నంబర్వన్ జోడీ ఫజర్ అల్ఫియాన్–ముహమ్మద్ రియాన్ అర్డియాంటో (ఇండోనేసియా)పై సంచలన విజయం సాధించారు. సాత్విక్, చిరాగ్ ఈ సీజన్లో ఇప్పటికే స్విస్ ఓపెన్, ఆసియా చాంపియన్షిప్, ఇండోనేసియా ఓపెన్ టైటిళ్లు నెగ్గారు. ఇక అల్ఫియాన్–అర్డియాంటోతో గత రెండు మ్యాచ్ల్లోవిజయం సాధించిన ఇండియన్స్ ఈసారి కూడా వాళ్లకు చెక్ పెట్టారు.
తొలి గేమ్ చేజారినా..
ఫైనల్లో సాత్విక్–చిరాగ్కు ఆరంభం కలిసి రాలేదు. గంటా 2 నిమిషాల మ్యాచ్లో తొలి గేమ్ను కోల్పోయారు. 2–2తో స్కోరు సమం చేసినా తర్వాత ఇండియన్ ద్వయం కొట్టిన షాట్స్ స్వల్ప తేడాలో లైన్ బయటకు వెళ్లిపోయాయి. దీంతో వరుసగా ఆరు పాయింట్లు చేజార్చుకున్నారు. దీన్ని ఆసరాగా తీసుకున్న ఇండోనేసియా ప్లేయర్లు బేస్లైన్ షాట్లతో రెచ్చిపోయారు. బ్రేక్ వరకు ఏడు పాయింట్ల లీడ్ను సాధించారు. తర్వాత సాత్విక్ జంట ఒకటి, రెండు పాయింట్లతో ముందుకెళ్లినా, అల్ఫియాన్–అర్డియాంటో వరుస పాయింట్లతో లీడ్ను 19–10కి పెంచుకుని వెనుదిరిగి చూసుకోలేదు. ఇక రెండో గేమ్ స్టార్టింగ్లో ఇరు జంటలు ర్యాలీస్తో పోటీపడటంతో ఓ దశలో స్కోరు 6–6తో సమమైంది. ఇక్కడి నుంచి సాత్విక్–చిరాగ్ పవర్–పేస్ను జోడించి బలమైన షాట్లు కొట్టారు. ముఖ్యంగా సాత్విక్ తన ట్రేడ్ మార్క్ స్మాష్లతో ప్రత్యర్థులను ఉక్కిరిబిక్కిరి చేశాడు. ఫలితంగా 10–8 లీడ్లోకి వెళ్లారు.
అదే టైమ్లో ఇండోనేసియా ప్లేయర్లు కొట్టిన షాట్లు వైడ్గా వెళ్లడం, బేస్ లైన్ నుంచి చిరాగ్ క్రాస్ రిటర్న్లతో ఆధిక్యాన్ని 17–11కు తీసుకెళ్లాడు. ఇక్కడి నుంచి ఇండియన్ ప్లేయర్లు 9 గేమ్ పాయింట్లను గెలిచి మ్యాచ్లో నిలిచారు. డిసైడర్లో మరింత కంట్రోల్గా ఆడిన సాత్విక్–చిరాగ్ 9–6, 11–8తో దూసుకెళ్లారు. వరల్డ్ నంబర్వన్ జోడీకి ఏమాత్రం చాన్స్ ఇవ్వకుండా బ్రేక్ తర్వాత కూడా అదే దూకుడుతో 13–10 లీడ్లోకి వెళ్లారు. ఈ దశలో ఇండోనేసియన్లు ఫ్లాట్ సర్వ్లతో సాత్విక్–చిరాగ్ను నిలువరించే ప్రయత్నం చేసి ఫెయిలయ్యారు. చకచకా పాయింట్లు నెగ్గుతూ ఇండియన్ ప్లేయర్లు 18–12తో విజయం దిశగా వెళ్లారు. అల్ఫియాన్ పవర్ఫుల్ బ్యాక్ హ్యాండ్ షాట్లతో రెండు పాయింట్లు సాధించినా ఫలితం లేకపోయింది. గెలుపుకు అవసరమైన మిగతా మూడు పాయింట్లు నెగ్గిన ఇండియన్స్ టైటిల్ సొంతం చేసుకున్నారు.
గంగ్నమ్ సెలబ్రేషన్స్
కోర్టులో దూకుడైన ఆటతో పాటు తమ సెలబ్రేషన్స్తోనూ సాత్విక్, చిరాగ్ ఆకట్టుకుంటున్నారు. సెమీస్ నెగ్గాక భాంగ్రా స్టెప్పులు వేసిన ఈ యంగ్స్టర్స్.. ఫైనల్ విక్టరీని గంగ్నమ్ స్టైల్ డ్యాన్స్ తో సెలబ్రేట్ చేసుకున్నారు.