లింగంపేట మండలంలోని నామినేషన్ కేంద్రాలను పరిశీలించిన అబ్జర్వర్

లింగంపేట మండలంలోని  నామినేషన్ కేంద్రాలను పరిశీలించిన అబ్జర్వర్

లింగంపేట, వెలుగు :  మండలంలోని లింగంపల్లి ఖుర్దు, లింగంపేట ఎంపీడీవో కార్యాలయంలో ఏర్పాటు చేసిన  నామినేషన్​ కేంద్రాలను సోమవారం ఎన్నికల పరిశీలకుడు సత్యనారాయణరెడ్డి  పరిశీలించారు.  సర్పంచ్​, వార్డు సభ్యుల అభ్యర్థులతో మాట్లాడారు. మీ గ్రామంలో ఎంత మంది ఓటర్లు ఉన్నారు ? మీరు  ఏ పదవికి పోటీ చేస్తున్నారు.. అంటూ ఆరా తీశారు. 

మండలంలో ఎన్ని గ్రామపంచాయతీలు ఉన్నాయని  ఎంపీడీవో నరేశ్​ను అడిగి తెలుసుకున్నారు. నామినేషన్​ కేంద్రాల వద్ద  కుర్చీలు ఏర్పాటు చేయాలని ఎంపీడీవోకు సూచించారు.  అనంతరం  లింగంపేట రైతువేదిక భవనంలో ప్రిసైడింగ్ అధికారులకు నిర్వహించిన శిక్షణ  తరగతులను పరిశీలించారు. ఆయన వెంట డీపీవో మురళి, తహసీల్దార్​ సురేశ్, ఎంపీవో మలహరి తదితరులు పాల్గొన్నారు.