బీజేపీ, కాంగ్రెస్ లీడర్లు ఎన్నికలప్పుడే వస్తరు

బీజేపీ, కాంగ్రెస్ లీడర్లు ఎన్నికలప్పుడే వస్తరు

అన్ని వర్గాల సంక్షేమం చూస్తున్న ఏకైక నాయకులు కేసీఆరేనన్నారు మంత్రి సత్యవతి రాథోడ్. వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల సందర్భంగా ఆమె ప్రచారం చేశారు. బీజేపీ, కాంగ్రెస్ లీడర్లు ఎన్నికలపుడే కనిపిస్తారన్నారు సత్యవతి. మత రాజకీయాలు చేసే బీజేపీకి సరైన బుద్ధి చెప్పాలన్నారు. కాంగ్రెస్ కనుచూపు మేరలో లేదన్నారు. ఉన్న నలుగురు నాయకులు నాలుగు దిక్కులకు వెళ్తున్నారన్నారు. టీఆర్ఎస్ ను గెలిపిస్తే డబుల్ బెడ్ రూం ఇండ్లిస్తామన్నారు సత్యవతి. కేసీఆర్ నాయకత్వంలో కోటి 30 లక్షల ఎకరాల్లో వ్యవసాయం జరుగుతుందన్నారు.