
ఆ దేశ రాయబారిని కోరిన కేటీఆర్
హైదరాబాద్, వెలుగు: మంత్రులు కేటీఆర్, మహమూద్ అలీతో సౌదీ అరేబియా రాయబారి సవూద్ బిన్ మహ్మద్ అస్సతి సోమవారం ప్రగతి భవన్లో భేటీ అయ్యారు. రాష్ట్రంలో పెట్టుబడులకు అనుకూలమైన వాతావరణం ఉందని ఆయనకు కేటీఆర్ వివరించారు. హైదరాబాద్లో సౌదీ కాన్సులేట్ ఆఫీస్ను ఏర్పాటు చేయాలని కోరారు. టీఎస్ ఐపాస్తో ప్రపంచంలోని పెద్ద కంపెనీలు రాష్ట్రానికి వచ్చాయని తెలిపారు. సౌదీ ఇండస్ట్రియలిస్ట్లతో ఇక్కడ పెట్టుబడి పెట్టించేందుకు ఐటీ, ఇండస్ట్రీస్ ఇతర రంగాల ప్రతినిధులతో కలిసి సౌదీలో పర్యటిస్తామని ఆయన