
- జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం ధోనూర్ స్కూల్లో ఘటన
జగిత్యాల, వెలుగు: పేరెంట్స్ మీటింగ్ లో ఇద్దరు గవర్నమెంట్ టీచర్లు బూతులు తిట్టుకుంటూ కొట్టుకున్నారు. వారిని అడ్డుకోబోయిన మహిళా ఎంఈవోపైనా దాడి చేశారు. జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం ధోనూర్ జడ్పీ హైస్కూల్లో శుక్రవారం పేరెంట్స్, టీచర్స్ సమావేశం నిర్వహించారు. ఎంఈవో ఎస్ సీతామహాలక్ష్మి పాల్గొన్న సమావేశంలో స్కూల్ టీచర్ గడిపెల్లి మహేశ్ అదే స్కూల్ లో పని చేస్తున్న కాశెట్టి రమేశ్పై బూతులు తిడుతూ దాడికి దిగాడు.
దీంతో రమేశ్ సైతం మహేశ్పై దాడికి దిగాడు. వారిని అడ్డుకునేందుకు వెళ్లిన ఎంఈవోను మహేశ్ చేయి పట్టుకుని కొట్టాడు. ఇదిలాఉంటే మహేశ్ వ్యవహార శైలిపై గతంలో డీఈవో కు ఫిర్యాదు చేయడాన్ని మనసులో పెట్టుకుని రమేశ్పై దాడి చేసినట్లు చెబుతున్నారు. ఈ ఘటనపై ఎంఈవో సీతామహాలక్ష్మి ధర్మపురి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.