నెమళ్లతో ఆడుకోవడంలో ప్రధాని బిజీ.. రాహుల్ కామెంట్స్

నెమళ్లతో ఆడుకోవడంలో ప్రధాని బిజీ.. రాహుల్ కామెంట్స్

న్యూఢిల్లీ: కరోనా వ్యాప్తిని అరికట్టడంలో కేంద్రం విఫలమైందంటూ కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ విమర్శలకు దిగుతున్న సంగతి తెలిసిందే. మరోమారు మోడీ సర్కార్‌‌పై రాహుల్ మండిపడ్డారు. పార్లమెంట్ సమావేశాలకు ముందు బీజేపీ ప్రభుత్వంపై కామెంట్స్ చేశారు. ప్రజలు వారి ప్రాణాలను వాళ్లే కాపాడుకోవాలని.. ఎందుకంటే ప్రధాని మోడీ నెమళ్లతో ఆడుకోవడంలో బిజీగా ఉన్నారని దుయ్యబట్టారు. ‘ఈవారంలో ఇండియాలో కరో్నా కేసుల సంఖ్య 50 లక్షలు దాటనుంది. యాక్టివ్ కేసుల సంఖ్య 10 లక్షలకు చేరుకోనుంది. ఒక మనిషి (ప్రధాని మోడీ) అహంకారం వల్ల సరైన వ్యూహం లేకుండా లాక్‌‌డౌన్ విధించారు. దీని వల్ల కరోనా దేశవ్యాప్తంగా వ్యాపించింది. ఆత్మనిర్భర్ అంటూ మోడీ ప్రభుత్వం అంటోంది. ఆత్మనిర్భర్ అంటే అర్థమేంటో తెలుసా.. మీ ప్రాణాలను మీరే కాపాడుకోవడం. ఎందుకంటే ప్రధాని నెమళ్లతో ఆడుకోవడంలో బిజీగా ఉన్నారు మరి’ అని రాహుల్ ట్వీట్ చేశారు.