
ప్రభుత్వ రంగ బ్యాంకు స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా (SBI) కస్టమర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. పండుగ సీజన్ సందర్భంగా కార్ల రుణాలపై ప్రాసెసింగ్ ఫీజను రద్దు చేసినట్టు ప్రకటించింది. దసరా, దీపావళి పండుగల సందర్భంగా ఎస్బీఐ ముందుగానే తన కస్టమర్లకు ఈ శుభవార్త అందించింది. కార్ల రుణాలపై 8.70% వడ్డీని వసూలు చేయనుంది. యోనో యాప్ లేదా బ్యాంక్ వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో కారు రుణం కోసం దరఖాస్తు చేసుకున్న కస్టమర్లకు వడ్డీ రేటుపై మరో 25 BPS పాయింట్ల రాయితీ లభిస్తుంది. అలాగే ఉద్యోగస్థులైన బ్యాంకు కస్టమర్లు కారు ఆన్ రోడ్ ధరలో 90% వరకు రుణాన్ని పొందవచ్చు.