సీసీఎంబీకి రూ. 9.94 కోట్ల సాయం

సీసీఎంబీకి రూ. 9.94 కోట్ల సాయం

హైదరాబాద్, వెలుగు : కొవిడ్​పై మెరుగైన పరిశోధనలను స్పీడ్​గా నిర్వహించేందుకు సీసీఎంబీకి ఎస్​బీఐ ఆర్థిక సాయం అందించింది. ఎస్​బీఐ చైర్మన్ దినేశ్​ ఖారా రూ. 9.94 కోట్ల  చెక్కును సీసీఎంబీ డైరెక్టర్ వినయ్ కుమార్ కు ఇచ్చారు.  సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ జీనోమ్ గైడెడ్ పాండమిక్ ప్రివెన్షన్ బలోపేతానికి సీఎస్ఆర్ నిధులతో ఎస్​బీఐ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మంజూరు చేసినట్లు తెలిపారు. కరోనా నియంత్రణపై ఆధునిక విధానాల్లో పరిశోధనలు జరగాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.  ఎస్​బీఐ డీఎండీ ఓపీ మిశ్రా, డీఎండీ విశ్వనాథన్, ఎస్​బీఐ ఫౌండేషన్ ఎండీ మంజుల కళ్యాణ సుందరం, ఫౌండేషన్ సభ్యులు ఉన్నారు.