న్యూఢిల్లీ: ఆర్బీఐ వచ్చే వారం మానిటరీ పాలసీ మీటింగ్ (ఎంపీసీ)లో రెపో రేటును 0.25 శాతం తగ్గించినప్పటికీ, మూడు శాతం నికర వడ్డీ మార్జిన్ (ఎన్ఐఎం) లక్ష్యాన్ని చేరుకుంటామని ఎస్బీఐ చైర్మన్ శ్రీనివాసులు శెట్టి అన్నారు.
తమ అంచనా ప్రకారం ఇది కేవలం స్వల్ప కోత మాత్రమే అవుతుందని, మార్జిన్లపై ఎక్కువ ప్రభావం ఉండబోదని తెలిపారు. సీఆర్ఆర్ ప్రయోజనం, ఫిక్స్డ్ డిపాజిట్ల (ఎఫ్డీ) రీప్రైసింగ్, పొదుపు ఖాతాలపై వడ్డీ రేట్ల తగ్గింపు వంటివి ఎన్ఐఎం టార్గెట్ను చేరుకోవడానికి సాయపడతాయని అన్నారు.
కేవలం 30 శాతం ఆస్తులు రెపో రేటుకు లింక్అయి ఉన్నందున మార్జిన్లపై ఒత్తిడి పరిమితంగా ఉంటుందని స్పష్టం చేశారు. సెప్టెంబర్ క్వార్టర్లో ఎస్బీఐ ఎన్ఐఎం 2.93 శాతంగా నమోదైంది.
