
NRI News: అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వచ్చినప్పటి నుంచి అక్కడి యూనివర్సిటీల్లో చదువుతున్న విదేశీ విద్యార్థులు నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. ఏ వంకతో తమను డిపోర్ట్ చేస్తారో అనే భయాలు వారిని ఆందోళనకు గురిచేస్తున్నాయి. సోషల్ మీడియా వెట్టింగ్ నుంచి చిన్న తప్పులకు సైతం అమెరికాను వీడాలంటూ అనేక మందికి నోటీసులు రావటం వారితో పాటు వారి తల్లిదండ్రులకు కూడా ఆందోళన కలిగిస్తున్నాయి. పైగా ఇలాంటి సమస్యలు ఎదుర్కొంటున్న వారిలో భారతీయ విద్యార్థుల సంఖ్య అధికంగా ఉండటం గమనార్హం. దీనిని కొందరు మోసగాళ్లు ఆసరాగా వినియోగించుకుంటున్నారని తేలింది.
తాజాగా అమెరికాలో చదువుతున్న శ్రయా బేడీ అనే విద్యార్థికి మోసగాళ్ల చేసితో స్కామ్ కి గురయ్యారు. ఆమె యూఎస్ ఇమ్మిగ్రేషన్ చట్టాలను అతిక్రమించిందంటూ స్కామర్లు టార్గెట్ చేశారు. అరెస్ట్, డిపోర్టేషన్ నుంచి తప్పించుకోవాలంటే వెంటనే బాండ్ రూపంలో 5వేల డాలర్లు చెల్లించాలంటూ గిఫ్ట్ కార్డు కొనేలా చేశారు.
2022లో యూఎస్ వెళ్లిన ఆమె బ్లూమింగ్టన్ ప్రాంతంలోని ఇండియానా యూనివర్సిటీలో చదువుతున్నార. మే 29న తాము ఇమ్మిగ్రేషన్ మరియు కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులమంటూ మాటకలిపారు. ఆ సమయంలో ఆ అధికారి తన బ్యాడ్జ్ నంబర్, పేరు వంటి వివరాలను కూడా ఇచ్చి అధికారిక వెబ్ సైట్ నందు చెక్ చేసుకోవాలని కూడా సూచించారని ఆమె చెప్పింది. అన్నీ పరిశీలించగా అక్కడ చూపిన నంబర్ నుంచే కాల్ వచ్చిందని బేడీ చెప్పారు. ఆమె ప్రస్తుతం మానిటరింగ్ లో ఉన్నందున 3 గంటల ఎవరికీ కాల్ చేయకూడదని కూడా వారు హెచ్చరించారు.
►ALSO READ | ఎలాన్ మస్క్ కొత్తపార్టీ ‘‘ది అమెరికన్ పార్టీ’’! 80శాతం అమెరికన్ల సపోర్టు
ఆ సమయంలో తాను బయటపడ్డానన్న బేడీ స్కామర్లు సూచించినట్లు గిఫ్ట్ కార్డ్ కొని వాటి వివరాలను షేర్ చేసినట్లు ఆమె వెల్లడించింది. పోలీసులు తర్వాతి రోజు దీనికి బాండ్ పంపిస్తారని నమ్మబలికారు. అయితే మోసగాళ్లు సదరు మహిళకు సంబంధించిన అన్ని వివరాలు తెలుసుకునే టార్గెట్ చేసినట్లు వెల్లడైంది. ప్రస్తుతం ఆమె అమెరికాలో నివసించటానికి ఫండ్స్ కోసం గోఫండ్ మీ ద్వారా ప్రయత్నిస్తోంది.
ఇలాంటి పరిస్థితి ఎదురైతే లాయర్ ను వెంటనే సంప్రదించాలని ఆమె సూచించారు. ప్రభుత్వ అధికారులు నేరుగా కాల్ చేయరని వారు మెయిల్ ద్వారానే సంప్రదిస్తారని ఆమె వెల్లడించారు. అసలు ఏ గిఫ్ట్ కార్డులు, బ్యాంక్ వివరాలు, సోషల్ సెక్యూరిటీ నంబర్లను అధికారులు అడగరని.. తనలా ఇంకెవరూ మోసపోవద్దంటూ ఆమె విజ్ఞప్తి చేశారు. అక్కడి వ్యవస్థలు ఎలా పనిచేస్తాయే విదేశీ విద్యార్థులకు సరైన అవగాహన లేకపోవటంతో నష్టపోతున్నట్లు ఆమె వెల్లడించారు.