స్కాన్ చేయండి.. స్కామ్ లు చూడండి .. తమిళనాడులో బీజేపీపై డీఎంకే పోస్టర్లు

స్కాన్ చేయండి.. స్కామ్ లు చూడండి .. తమిళనాడులో బీజేపీపై డీఎంకే పోస్టర్లు

చెన్నై: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనేక కుంభకోణాలకు పాల్పడిందంటూ తమిళనాడులోని పలు ప్రాంతాల్లో పోస్టర్లు వెలిశాయి. ఈ పోస్టర్లను డీఎంకే కార్యకర్తలు వేశారు. పోస్టర్లపై భాగంలో జీపే అని రాయడంతో పాటు దానిపై ప్రధాని మోదీ ఫొటో, క్యూఆర్ కోడ్ ఉన్నాయి. ‘స్కాన్ చేయండి.. స్కామ్ లు చూడండి’  అని ఆ పోస్టర్లపై తమిళంలో రాసి ఉంది. మొబైల్ ఫోన్ తో పోస్టర్ ను స్కాన్ చేస్తే ఓ వీడియో వస్తుంది. 

ఆ వీడియోలో.. ఎలక్టోరల్ బాండ్ల స్కాం, కాగ్ నివేదిక ఎత్తి చూపిన అక్రమాలు, వివిధ మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల్లోని  అవినీతిని ఒక వ్యక్తి వివరించారు. బడా కార్పొరేట్లకు లక్షలాది కోట్ల రూపాయల రుణాలను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మాఫీ చేసిందని వెల్లడించారు. ఇండియా కూటమికి మద్దతివ్వాలని, బీజేపీని వ్యతిరేకించాలని ఓటర్లకు ఆయన పిలుపునిచ్చారు.