
ఢిల్లీ : పార్లమెంట్ ఎన్నికల నగారామోగింది. దేశమంతటా పార్లమెంట్ ఎన్నికలను మొత్తం ఏడు దశల్లో నిర్వహిస్తామని కేంద్ర ఎన్నికల కమిషన్ తెలిపింది. ఢిల్లీలో ఇవాళ సాయంత్రం ఐదు గంటలకు ప్రెస్ మీట్ నిర్వహించిన సీఈసీ సునీల్ అరోరా… దేశవ్యాప్తంగా పార్లమెంట్ ఎన్నికల షెడ్యూల్ ను వివరించారు. మొత్తం ఏడు దశల్లో పార్లమెంట్ ఎన్నికలు నిర్వహించనున్నారు. మే 23న ఫలితాలు విడుదల కానున్నాయి.
మొత్తం ఏడు దశల్లో వివిధ రాష్ట్రాల్లో పార్లమెంట్ ఎన్నికలు నిర్వహించనున్నారు
తొలి దశ : ఏప్రిల్ 11న
రెండో దశ : ఏప్రిల్ 18న
మూడో దశ : ఏప్రిల్ 23న
నాలుగో దశ : ఏప్రిల్ 29న
ఐదో దశ : మే 6న
ఆరోదశ : మే 12న
ఏడో దశ : మే 19
పార్లమెంట్ ఎన్నికల కౌంటింగ్ మే 23న
ఫేజ్ 1… 91 నియోజకవర్గాలు 20 రాష్ట్రాలు
ఫేజ్ 2.. 97 నియోజకవర్గాలు.. 13 రాష్ట్రాలు
ఫేజ్ 3.. 115 నియోజకవర్గాలు.. 15 రాష్ట్రాలు
ఫేజ్ 4.. 71 నియోజకవర్గాలు… 9 రాష్ట్రాలు
ఫేజ్ 5.. 51 నియోజకవర్గాలు… 7 రాష్ట్రాలు
ఫేజ్ 6… 59 నియోజకవర్గాలు… 7 రాష్ట్రాలు
ఫేజ్ 7.. 59 నియోజకవర్గాలు… 8 స్టేట్స్