స్టూడెంట్ను ఇంటికి పంపిన యాజమాన్యం
స్కూల్ ఎదుట స్వాముల ధర్నా
యాదాద్రి, వెలుగు: అయ్యప్ప మాల వేసుకున్న స్టూడెంట్ను 41 రోజులు బడికి రావద్దంటూ పంపించిన ఘటన యాదాద్రి జిల్లా కేంద్రంలో మంగళవారం జరిగింది. విషయం తెలుసుకున్న వీహెచ్పీ, భజరంగ్దళ్ప్రతినిధులు, అయ్యప్ప స్వాములు స్కూల్వద్ద ధర్నాకు దిగారు. జిల్లా కేంద్రంలోని ఇండియా మిషన్ స్కూల్లో పట్టణానికి చెందిన శివారెడ్డి కుమారుడు ప్రణీత్రెడ్డి నాలుగో తరగతి చదువుతున్నాడు. వచ్చే నెలలో శబరిమలై వెళ్లడానికి ప్రణీత్రెడ్డి అయ్యప్పమాల వేసుకున్నాడు. మాల వేసుకున్న స్టూడెంట్స్కూల్కు రావడంతో టీచర్ మాల ధరించిన 41 రోజులు రావద్దని పంపించివేశారు. దీంతో ప్రణీత్ ఇంటికి వెళ్లిపోయాడు. హిందూ సంస్థలు దీనిపై మధ్యాహ్నం స్కూల్ఎదుట ఆందోళనకు దిగాయి. కరస్పాండెంట్జుడాతో వాగ్వాదానికి దిగారు. ఇదే సమయంలో కొందరు కరస్పాండెంట్ రూంలోకి వెళ్లి కుర్చీలను పక్కకు పడేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి వచ్చి సర్దిచెప్పడానికి ప్రయత్నించినా స్వాములు వినలేదు. అదే సమయంలో ఒక స్టూడెంట్తల్లి అక్కడకు వచ్చారు. ఫీజు చెల్లించడంలో కాస్త ఆలస్యం చేసినందుకు కరస్పాండెంట్ తనను అసభ్య పదజాలంతో దూషించారని తెలిపారు. విషయం తెలుసుకున్న జిల్లా ప్రైవేట్స్కూళ్ల యూనియన్ తరఫున కరస్పాండెంట్లు బండిరాజుల శంకర్, విజయ్కుమార్ అక్కడకు చేరుకొని చర్చలు జరిపారు. కరస్పాండెంట్ క్షమాపణ చెప్పాలని, ప్రణీత్రెడ్డి తరగతులకు హాజరు కావడానికి ఒప్పుకుంటేనే తాము ఆందోళన విరమిస్తానని స్వాములు తేల్చి చెప్పారు. కరస్పాండెంట్ జుడా అయ్యప్ప స్వాములను క్షమాపణ కోరడంతో పాటు స్టూడెంట్ తరగతులకు హాజరు కావచ్చని చెప్పారు. దీంతో స్వాములు ఆందోళన విరమించారు.