లక్నో: ఫీజు కట్టకపోతే స్టూడెంట్స్ ను క్లాసులకు రానివ్వని, పరీక్షలు రాయనివ్వని బడులను చూశాం. కానీ యూపీలో ఓ స్కూల్ యాజమాన్యం మాత్రం ఫీజు కట్టని స్టూడెంట్లను ఏకంగా ఓ గదిలో బంధించింది. పేరెంట్స్ రిక్వెస్ట్ చేసినా వినకపోవడంతో పోలీసులు వచ్చి పిల్లలను విడిపించాల్సి వచ్చింది. బరేలీలోని ది హార్ట్మన్ స్కూల్లో శనివారం జరిగిందీ ఘటన. ఉదయం స్కూల్కు వచ్చిన స్టూడెంట్లలో ఫీజు కట్టని 35 మందిని ప్రిన్సిపాల్ క్లాసు నుంచి తీస్కెళ్లి, తన రూమ్లో నిలబెట్టిండు. తమ పిల్లలను తీస్కెళ్లడానికి వచ్చిన పేరెంట్స్ కు విషయం తెలిసి ఆందోళన చెందారు. పిల్లలను వదిలేయాలని రిక్వెస్ట్ చేసినా మేనేజ్మెంట్ పట్టించుకోలేదు. పేరెంట్స్ సమాచారమివ్వడంతో పోలీసులు స్కూలుకు వెళ్లి పిల్లలను విడిపించారు. ఆ సమయంలో చిన్నారులు భయంతో వణికిపోతూ, కొంత మంది ఏడుస్తూ కనిపించారు. పేరెంట్స్ అసోసియేషన్ ఈ ఘటనపై తీవ్రంగా స్పందించింది. అసోసియేషన్ మీటింగ్లో చర్చించి తదుపరి నిర్ణయం తీసుకుంటామని చెప్పింది.