లంచ్ కు సరుకులు ప్రభుత్వమే ఇవ్వాలి .. ఏఐటీయూసీ డిమాండ్

లంచ్ కు సరుకులు ప్రభుత్వమే ఇవ్వాలి ..    ఏఐటీయూసీ డిమాండ్

బషీర్​బాగ్​, వెలుగు: రాష్ట్రవ్యాప్తంగా స్కూళ్లలో మధ్యాహ్న భోజనానికి సరుకులు మొత్తం ప్రభుత్వమే సరఫరా చేయాలని ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు ఎం.డి.యూసుఫ్ డిమాండ్​ చేశారు. మధ్యాహ్న భోజన పథకం వర్కర్స్ యూనియన్(ఏఐటీయూసీ అనుబంధం) పిలుపు మేరకు వంట కార్మికులు సోమవారం భారీ సంఖ్యలో హాజరై లక్డికాపూల్​లోని డైరెక్టర్‌‌ ఆఫ్‌‌ స్కూల్ ఎడ్యుకేషన్ కమిషనర్ కార్యాలయాన్ని ముట్టడించారు. 

అనంతరం ప్రాథమిక విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ నికోలస్ కు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 24 ఏండ్లుగా వంట కార్మికులు సొంత ఖర్చులతో భోజనాలు వండి, విద్యార్థులకు అందిస్తున్నప్పటికీ సరైన గౌరవ వేతనం లేకపోవడం బాధాకరమన్నారు. పెట్టుబడి పెట్టిన డబ్బులు ఎన్నో ఏళ్లుగా పెండింగ్‌‌లో ఉండడంతో వంట పనులు సాగించడం కష్టమవుతోందన్నారు. 

ఈ ధర్నాలో ఏఐటీయూసీ రాష్ట్ర ఉప ప్రధాన కార్యదర్శి ఎం.నరసింహ, మధ్యాహ్న భోజన పథకం వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పి.ప్రేమ్ పావని, జంపాల రవీందర్  పాల్గొన్నారు.