ఘట్కేసర్, వెలుగు: స్కూటీ అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న చెట్టును ఢీకొనడంతో ఇద్దరు నేపాల్ యువకులు మృతి చెందారు. నేపాల్కు చెందిన కమల్ టమాటా (20), దామర్ టమాటా (18) ఘట్కేసర్ పరిధిలోని ఈడబ్ల్యూఎస్ కాలనీలో నివసిస్తూ ఫాస్ట్ఫుడ్ సెంటర్లో పని చేస్తున్నారు. ఆదివారం రాత్రి 11 గంటల సమయంలో బోగారంలోని బంధువుల ఇంటికి హోండా యాక్టివాపై బయలుదేరారు.
కొండాపూర్ సమీపంలో అదుపు తప్పి చెట్టును ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో ఇద్దరూ తీవ్ర గాయాలతో స్పాట్లోనే మృతి చెందారు. అతివేగమే ఈ ప్రమాదానికి కారణమని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. బాధిత కుటుంబసభ్యుల ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ బాలస్వామి తెలిపారు.
ఇబ్రహీంపట్నంలో మరొకరు
ఇబ్రహీంపట్నం: అతివేగంతో వెళ్తున్న బైక్ అదుపు తప్పి డివైడర్ను ఢీకొనడంతో ఇబ్రహీంపట్నంలో మరొకరు మృతి చెందారు. ఇబ్రహీంపట్నం మండలం ఎంపీ పటేల్గూడకు చెందిన బొమ్మ రాజు (35) సోమవారం సాయంత్రం సాగర్ రహదారిపై బైక్పై బెంగళూరు వైపు వెళ్తున్నాడు. ఈ క్రమంలో ఓవర్స్పీడ్తో అదుపుతప్పి డివైడర్ను ఢీకొట్టాడు. దీంతో అక్కడికక్కడే మృతి చెందాడు.
