
న్యూఢిల్లీ: ఎలక్ట్రానిక్స్ బజార్ పేరెంట్ కంపెనీ జీఎన్జీ ఎలక్ట్రానిక్స్, లాజిస్టిక్స్ సర్వీస్ ప్రొవైడర్ గ్లోటిస్, ఫార్మా సంస్థ అమంటా హెల్త్కేర్... ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్ల (ఐపీఓలు) ద్వారా నిధులను సేకరించడానికి సెబీ అనుమతిని పొందాయి. ఈ ఏడాది ఫిబ్రవరి, -మార్చిలో సెబీకి ఇవి డాక్యుమెంట్స్అందించాయి. ఈ నెల 16–-20 తేదీల మధ్య అబ్జర్వేషన్ లెటర్లను పొందాయి. ఈ లెటర్లు రావడమంటే ఐపీఓకు అనుమతి వచ్చినట్టుగానే భావిస్తారు. జీఎన్జీ ఎలక్ట్రానిక్స్ ఐపీఓ సైజు రూ. 450 కోట్లు కాగా, ఇందులో ఫ్రెష్ ఇష్యూతోపాటు ఓఎఫ్ఎస్ పోర్షన్ ఉంటాయి.
చెన్నైకి చెందిన గ్లోటిస్ ఐపీఓ సైజు రూ. 160 కోట్లు కాగా, ఇందులోనూ ఫ్రెష్ ఇష్యూతోపాటు ఓఎఫ్ఎస్ఉంటాయి. ప్రమోటర్లు 1.45 కోట్ల వరకు షేర్లను అమ్ముతారు. గ్లోటిస్ అనేది మల్టీ-మోడల్, ఇంటిగ్రేటెడ్ లాజిస్టిక్స్ సర్వీస్ ప్రొవైడర్. ఫార్మా కంపెనీ అమంటా హెల్త్కేర్ ఐపీఓలో పూర్తిగా ఫ్రెష్ఇష్యూ ఉంటుంది. ఇది వైద్య పరికరాలను, స్టెరైల్ లిక్విడ్ ఉత్పత్తులను తయారు చేస్తుంది. ఈ మూడు కంపెనీల షేర్లు బీఎస్ఈ, ఎన్ఎస్ఈలో లిస్టవుతాయి.