మీ వాటాలను తగ్గించుకోవాలి
ముంబై: మ్యూచువల్ ఫండ్ సంస్థయూటీఐ ఏఎంసీ (అసెట్మేనేజ్మెంట్ కంపెనీ)లో వాటాను 10 శాతం దిగువకు తగ్గించుకోవాలని ప్రభుత్వరంగ సంస్థలైన ఎస్బీఐ, ఎల్ఐసీ, బీఓబీ(బ్యాంక్ ఆఫ్బరోడా)లను మార్కెట్ రెగ్యులేటర్ (సెబీ) శనివారం ఆదేశించింది. క్రాస్ హోల్డింగ్ రూల్స్ ప్రకారం వచ్చే ఏడాది డిసెంబర్ 31 నాటికి ఈ సంస్థలు తమ వాటాను తగ్గించుకోవాల్సి ఉంది. అంతేకాకుండా యూటీఐ ఏఎంసీ, యూటీఐ ట్రస్టీ బోర్డులోని తమ నామినీలను కూడా 2020 డిసెంబర్31 నాటికి తొలగించాల్సి ఉంటుంది. ఒక వేళ ఈ సంస్థలు తమ వాటాను 9.99 శాతం దిగువకు తగ్గించుకోకపోతే, షేర్హోల్డింగ్, ఓటింగ్ హక్కులు నిలిచిపోతాయని సెబీ తన ఆదేశాలలో పేర్కొంది. ఈ రూల్స్ అమలు రిపోర్టును ఈ మూడు సంస్థలు వచ్చే నెలలోపు సమర్పించాలని పేర్కొంది. కాగా ఈ అంశంపై ఎల్ఐసీ, ఎస్బీఐ, బీఓబీ స్పందించలేదు.
క్రాస్ హోల్డింగ్ లిమిట్ అంటే?
మ్యూచువల్ఫండ్స్లో కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ (విరుద్ధ ప్రయోజనాలు) తొలగించేందుకు సెబీ2018 మార్చిలో క్రాస్హోల్డింగ్ లిమిట్స్ను తీసుకొచ్చింది. ఈ రూల్స్ ప్రకారం ఏదైనా షేర్హోల్డర్ కంపెనీకి ఒక మ్యూచువల్ఫండ్కంటే ఎక్కువ మ్యూచువల్ఫండ్ కంపెనీలలో 10 శాతం కంటే ఎక్కువ వాటా ఉండొద్దు. అంతేకాకుండా ఆ కంపెనీలో షేరుహోల్డర్లు తమ బోర్డు పదవులకు రాజీనామా చేయాలి. ‘ఈ రూల్స్ మార్చి 20 నెలలు కావస్తున్నప్పటికీ ఈ సంస్థలు(ఎల్ఐసీ, ఎస్బీఐ, బీఓబీ) వీటిని అనుసరించడం లేదు’ అని సెబీ మెంబర్ మహాలింగం అన్నారు. ‘ఈ మూడు సంస్థలు యూటీఐ ఏఎంసీలోని తమ వాటాను తగ్గించుకుంటున్నాయి. అయినప్పటికి రెగ్యులేషన్7బీ రూల్ ఇంకా పెండింగ్లోనే ఉంది’ అని తెలిపారు. ‘కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మొత్తం మ్యూచువల్ఫండ్పరిశ్రమపైనే తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది’ అని సెబీ పేర్కొంది. ‘మ్యూచువల్ఫండ్ పరిశ్రమను మెరుగుపరిచేందుకు ఈ కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ను తొలగించడంలో రెగ్యులేషన్ 7బీని అమలు పరచడం కష్టం’ అని వివరించింది. కాగా తమ వాటాలను తగ్గించుకోవడంపై ఈ మూడు ప్రభుత్వ సంస్థలు తమ రోడ్మ్యాప్ను ప్రకటించలేదు. యూటీఐ ఏఎంసీ 2009, నవంబర్7 షేర్హోల్డింగ్ అగ్రిమెంట్ ప్రకారం 10 శాతం కంటే అధికంగా వాటాను కలిగిన షేర్హోల్డింగ్ వ్యక్తులు లేదా కంపెనీలు కంపెనీలకు బోర్డులో డైరక్టర్లను నామినేట్ చేసే అధికారం ఉంటుంది. ప్రస్తుతం యూటీఐ మ్యూచువల్ఫండ్లో ఎల్ఐసీ, ఎస్బీఐ, బీఓబీ సంస్థలకు 18.25 శాతం చొప్పున వాటా ఉంది.