న్యూఢిల్లీ: ఫైనాన్షియల్ మార్కెట్లలో పారదర్శకత కోసం సెబీ సోమవారం పాస్ట్ రిస్క్ అండ్ రిటర్న్ వెరిఫికేషన్ ఏజెన్సీ (పర్వా) విధానాన్ని తెచ్చింది. కేర్ రేటింగ్స్, ఎన్ఎస్ఈ సహకారంతో దీన్ని ప్రారంభించింది. సెబీ రిజిస్టర్డ్ అడ్వైజర్లు తమ గత పనితీరును దీని ద్వారా చెక్ చేసుకోవచ్చు. ఫిన్ఫ్లూయెన్సర్లు చేసే తప్పుడు ప్రచారాలను అరికట్టడమే పర్వా లక్ష్యమని సెబీ చైర్మన్ తుహిన్ కాంత పాండే తెలిపారు. మధ్యవర్తులు తమకు వచ్చిన లాభాలను మాత్రమే చూపించడానికి ఇందులో వీల్లేదు. ఇన్వెస్టర్లు సరైన నిర్ణయాలు తీసుకునేందుకు ఇది సాయపడుతుంది.
