అదానీ రూల్స్​ అతిక్రమిస్తే యాక్షన్​ తీసుకుంటాం: సుప్రీం కోర్టు అఫిడవిట్లో సెబీ

అదానీ రూల్స్​ అతిక్రమిస్తే యాక్షన్​ తీసుకుంటాం:  సుప్రీం కోర్టు అఫిడవిట్లో  సెబీ

న్యూఢిల్లీ: ఎక్స్​పర్ట్​కమిటీ రిపోర్టుతో తాము ఏకీభవించలేమని, అదానీ–హిండెన్​బర్గ్​ కేసు దర్యాప్తుకు తమ రూల్స్​ అడ్డం కావని సెబీ తాజాగా సుప్రీం కోర్టుకు సమర్పించిన అఫిడవిట్​లో వెల్లడించింది. ఆఫ్​షోర్​ ఫండ్స్​ బెనిఫిషియరీలను గుర్తించడానికి సెబీ రూల్స్​ అడ్డొస్తున్నాయని ఎక్స్​పర్ట్​ కమిటీ అంతకు ముందు సుప్రీం కోర్టుకు తెలిపింది. 

తమ విచారణలో అదానీ గ్రూప్​రూల్స్​ అతిక్రమించినట్లు తేలితే, యాక్షన్​ తీసుకుంటామని సెబీ పేర్కొంది. అదానీ షేర్లలో మ్యానిప్యులేషన్​ జరగలేదని, రెగ్యులేటరీ ఫెయిల్యూర్​ లేదని ఎక్స్​పర్ట్​ కమిటీ మే నెలలో  వెల్లడించింది. మంగళవారం సుప్రీం కోర్టులో విచరణ జరగనుంది.