ఇద్దరు బిడ్డలు పుట్టాక మరో పెళ్లి

ఇద్దరు బిడ్డలు పుట్టాక మరో పెళ్లి

నెల్లూరు: ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. జీవితాంతం తోడుగా ఉంటానని భరోసా ఇచ్చాడు. ఇద్దరు బిడ్డలు పుట్టాక ప్లేట్ మార్చాడు. భార్యపై మోజు తీరాక మరో యువతిని పెళ్లి చేసుకున్నాడు. తనకు న్యాయం చేయాలంటూ భార్య స్థానిక ఎమ్మెల్యే, పోలీసులను వేడుకుంటోంది. ఈ సంఘటన నెల్లూరు జిల్లాలో జరిగింది.

వివరాలు : నెల్లూరు నవాబ్‌పేటకు చెందిన మైనర్ ఇంటర్ చదువుతుండగా..వలేటివారిపాలెం మండలం శింగమనేనిపల్లి గ్రామానికి గ్రామానికి చెందిన వెంకటసురేంద్రతో మూడేళ్ల క్రితం ఆమెకు పరిచయం ఏర్పడింది. పరిచయం కాస్త ప్రేమగా మారింది. దీంతో వెంకట సురేంద్ర చెన్నైలో ఉద్యోగం చేస్తున్నానని చెప్పి ప్రియురాలిని అక్కడకు తీసుకొని వెళ్లి పెళ్లి చేసుకున్నాడు.

కొన్ని రోజుల తర్వాత ఆంధ్రాకు తీసుకువచ్చి కావలి, ఒంగోలు, కందుకూరులో కాపురం పెట్టాడు. ఈ క్రమంలో ఆమె గర్భం దాల్చగా జన్మించిన బిడ్డ మృతి చెందింది. రెండవ సారి మరో బిడ్డ పుట్టింది. అప్పట్నుంచే భార్యపై మోజు తీరిన సురేంద్ర ఆమెను చిత్రహింసలు పెట్టాడు. ఎలాగైనా వదిలించుకోవాలని ప్లాన్ వేశాడు. రోజు కొట్టడంతో వేధింపులు తాళలేక యువతి నెల్లూరులోని అమ్మమ్మ వద్ద ఉంటుంది.

భార్యను వదిలించుకున్న సురేంద్ర నాలుగు రోజుల క్రితం మరో యువతిని పెళ్లి చేసుకున్నాడు. విషయం తెలిసి మొదటి భార్య సురేంద్ర ఇంటికి వెళ్లి తనకు తన బిడ్డకు న్యాయం చేయాలని కోరింది. సురేంద్ర, అతడి కుటుంబసభ్యులు బెదిరించడంతో ఆమె సోమవారం ఎమ్మెల్యే మహీధర్‌రెడ్డి సాయంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. నిందితుడిపై కేసు నమోదు చేసి, చర్యలు తీసుకుంటామని తెలిపారు పోలీసులు.

See Also: అమెరికాలో తెలుగు యువతిపై అత్యాచారం.. హత్య