- ముగిసిన నామినేషన్ల విత్ డ్రా
- నిజామాబాద్ జిల్లాలో 38, కామారెడ్డి జిల్లాలో 44 సర్పంచ్లు ఏకగ్రీవం
నిజామాబాద్/ కామారెడ్డి, వెలుగు : ఉమ్మడి జిల్లాలో రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల అభ్యర్థుల లెక్క తేలింది. నామినేషన్ల విత్డ్రా తర్వాత పోటీలో ఉన్న అభ్యర్థులను అధికారులు ప్రకటించి ఎన్నికల గుర్తులు కేటాయించారు. కామారెడ్డి జిల్లాలో 197 పంచాయతీ ఉండగా, అందులో 44 సర్పంచ్ పదవులు ఏకగ్రీవమయ్యాయి. నిజామాబాద్ జిల్లాలో మొత్తం 196 సర్పంచ్ స్థానాలకు నామినేషన్లు ఆహ్వానించగా, 38 మంది సర్పంచ్లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
