తెలుగు యోధాస్‌‌కు రెండో విక్టరీ

తెలుగు యోధాస్‌‌కు రెండో విక్టరీ

కటక్‌ ‌: అల్టిమేట్‌‌ ఖోఖో లీగ్‌‌ రెండో సీజన్‌‌లో తెలుగు యోధాస్‌‌ రెండో విజయాన్ని అందుకుంది. బుధవారం జరిగిన మూడో లీగ్‌‌ మ్యాచ్‌‌లో యోధాస్‌‌ 38–28 తేడాతో రాజస్తాన్‌‌ వారియర్స్‌‌పై గెలిచింది. అటాకింగ్‌‌లో యోధాస్‌‌ ప్లేయర్‌‌ సౌరభ్‌‌ అడ్వాకర్‌‌ 6 పాయింట్లు సాధించాడు. స్కై డైవ్‌‌లో 16, టచ్‌‌లో 18 పాయింట్లతో తెలుగు టీమ్‌‌ జోరు చూపెట్టింది. రాజస్తాన్‌‌ 8 టచ్‌‌, 14 స్కై డైవ్‌‌ పాయింట్లకే పరిమితమైంది. ఓవరాల్‌‌గా ఆడిన మూడు మ్యాచ్‌‌ల్లో రెండు విజయాలతో  6 పాయింట్లు సాధించిన తెలుగు యోధాస్‌‌ పాయింట్ల పట్టికలో రెండో ప్లేస్‌‌లో కొనసాగుతున్నది.