అమరావతిలో 144 సెక్షన్.. బంద్‌కు రైతుల పిలుపు

అమరావతిలో 144 సెక్షన్.. బంద్‌కు రైతుల పిలుపు

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో పోలీసులు 144, 34 సెక్షన్ విధించారు. రైతులు తమ ఆందోళనను శాంతియుతంగా, ప్రజలకు ఇబ్బంది కలగకుండా నిర్వహించాలని కోరారు. చట్టాన్ని ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ఏపీ రాజధాని మూడు ప్రాంతాల్లో ఉంటుందన్న ప్రభుత్వ ప్రకటనతో రాజధాని ప్రాంతంలోని 29 గ్రామాల్లో రైతులు బంద్‌కు పిలుపునిచ్చారు. ఈ క్రమంలో పోలీసులు 144 సెక్షన్, 34 సెక్షన్‌ను అమలు చేస్తున్నారు. బంద్ కారణంగా స్కూళ్లు, వ్యాపార సంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు, హోటళ్లు మూసివేశారు. 29 గ్రామాల్లోని ఆయా గ్రామ సచివాలయాల దగ్గర రిలే నిరాహార దీక్షలు ప్రారంభించారు. ప్రభుత్వం తమ ప్రకటనను వెనక్కి తీసుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.