మంచి నీళ్లు కావాలంటూ ఇంట్లోకి వెళ్లి..!

మంచి నీళ్లు కావాలంటూ ఇంట్లోకి వెళ్లి..!

థానె:  65 ఏండ్ల వృద్ధురాలిపై 25 ఏండ్ల సెక్యూరిటీ గార్డు అత్యాచారానికి పాల్ప‌డ్డాడు. ఈ దారుణ సంఘటన మ‌హారాష్ట్ర‌లోని థానె జిల్లాలో జ‌రిగింది. థానె లోని  హౌసింగ్ సొసైటీలో సెక్యూరిటీగార్డుగా ప‌నిచేస్తున్న 25 ఏండ్ల యువ‌కుడు మంచినీళ్ల కోసం ఓ ఇంట్లోకి వెళ్లాడు. ఆ ఇంట్లో ఉన్న వృద్ధురాలిని తాగ‌డానికి మంచినీళ్లు ఇవ్వ‌మ‌ని అడిగాడు. ఆమె నీళ్లు తీసుకుని వ‌చ్చేలోపు ఒంట‌రిగా ఉన్న‌ద‌ని గ‌మ‌నించి ఆమెపై అత్యాచారానికి పాల్ప‌డ్డాడు.

ఈ నెల 3న ఈ ఘ‌ట‌న చోటుచేసుకోగా.. అదేరోజు వృద్ధురాలు పోలీసుల‌కు ఫిర్యాదు చేసింది. కేసు న‌మోదుచేసి నిందితుడి కోసం గాలింపు చేప‌ట్టిన పోలీసులు మంగళవారం అదుపులోకి తీసుకున్నారు. అత‌నిపై సంబంధిత సెక్ష‌న్ల కింద కేసులు న‌మోదు చేశామని చెప్పారు పోలీసులు. ముసలవ్వను హాస్పిటల్ అడ్మిట్ చేసి ట్రీట్ మెంట్ అందిస్తున్నట్లు తెలిపారు. అత్యాచారానిని పాల్పడ్డ యువకుడిని కఠనంగా శిక్షించాలని వృద్ధురాలి కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు.