![అమెరికాలో గన్ మిస్ఫైర్.. ఖమ్మం విద్యార్థి మృతి](https://static.v6velugu.com/uploads/2023/02/Security-guu-misfire-in-USA_z7wcIVqrkn.jpg)
అమెరికాలో గన్ మిస్ ఫైర్ కావడంతో ఖమ్మం జిల్లాకు చెందిన విద్యార్థి మృతి చెందాడు. మధిర పట్టణానికి చెందిన మహంకాళి అఖిల్ సాయి అనే విద్యార్థి ఎంఎస్ చదివేందుకు 13 నెలల క్రితం అమెరికా వెళ్లాడు. అలబామాలోని అబర్న్ యూనివర్సిటీలో చదువుకుంటూ.. అక్కడికి సమీపంలోని ఓ గ్యాస్ స్టేషన్లో పార్ట్టైమ్ జాబ్ చేస్తున్నాడు. అమెరికా కాలమానం ప్రకారం సోమవారం రాత్రి 10 గంటల సమయంలో గ్యాస్ స్టేషన్లోని సెక్యూరిటీ గార్డు వద్ద తుపాకీని పరిశీలిస్తున్న క్రమంలో అది మిస్ ఫైర్ అయింది. ఈ ఘటనలో అఖిల్ సాయి తలలోకి బుల్లెట్ దూసుకెళ్లడంతో అక్కడి సిబ్బంది హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ అఖిల్ మృతిచెందాడు. అఖిల్ సాయి మృతిపై కుటుంబసభ్యులకు సమాచారం అందించారు.