హైదరాబాద్‌ లో ఎస్ఈడీ ప్లాట్‌ఫామ్ లాంచ్..అమెరికా సంస్థతో ‘శ్రీచైతన్య’ ఒప్పందం

హైదరాబాద్‌ లో ఎస్ఈడీ ప్లాట్‌ఫామ్ లాంచ్..అమెరికా సంస్థతో ‘శ్రీచైతన్య’ ఒప్పందం

హైదరాబాద్, వెలుగు: విద్యార్థుల లెర్నింగ్ విధానాల్లో మార్పులు తీసుకువచ్చేందుకు అమెరికాకు చెందిన ప్రముఖ విద్యా సంస్థ స్టూడెంట్ ఎడ్యుకేషన్ డయాగ్నస్టిక్స్ (ఎస్ఈడీ) తన ప్లాట్‌ఫామ్‌ను భారత్‌లో అధికారికంగా ప్రారంభించింది. ఈ సంస్థతో శ్రీచైతన్య ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్​ చేతులు కలిపింది. హైదరాబాద్‌లోని హోటల్ దస్పల్లాలో శుక్రవారం ఎంవోయూ కుదుర్చుకున్నారు.

విద్యార్థులు పాఠాలను ఎలా గ్రహిస్తున్నారు? ఎక్కడ వెనుకబడుతున్నారనే అంశాలను ఎస్​ఈడీ సంస్థ విశ్లేషించి, వ్యక్తిగత అభివృద్ధి మార్గాలను  రూపొందించనుంది.  ఎస్ఈడీ వ్యవస్థాపకుడు వి.శ్రీనేశ్, ఎస్ఈడీ సీఈవో అష్లీ సంబాలుక్ , శ్రీచైతన్య ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ అకాడమిక్ డైరెక్టర్ సీమ బొప్పన పాల్గొన్నారు.