- కేటీఆర్కు చెప్పులతో బుద్ది చెప్పాలె..
- కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న
నర్సంపేట/తొర్రూరు, వెలుగు : ఉస్మానియా యూనివర్సిటీ స్టూడెంట్లను పల్లీ.. బటానీలు అమ్మేవారని కామెంట్ చేసిన కేటీఆర్కు స్టూడెంట్లు చెప్పులతో బుద్ది చెప్పాలని కాంగ్రెస్ వరంగల్–నల్గొండ –ఖమ్మం ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న పిలుపునిచ్చారు. వరంగల్ జిల్లా నర్సంపేట టౌన్లోని పద్మశాలీ గార్డెన్లో కాంగ్రెస్ ఆధ్వర్యంలో గురువారం గ్రాడ్యుయేట్స్ఆత్మీయ సమ్మేళనం జరిగింది.
ఇందులో పాల్గొన్న తీన్మార్మల్లన్న మాట్లాడుతూ నర్సంపేటలో కేటీఆర్చిల్లర కామెంట్లు చేశారని, ఓయూ విద్యార్థులు ఉద్యమం చేస్తే అధికారం అనుభవించి ఇప్పుడు పనికి రాని మాటలు మాట్లాడుతున్నారన్నారు. బీఆర్ఎస్ కు రాబోయే రోజుల్లో పిండం పెట్టడం ఖాయమని, ఒకవేళ పిండం పెట్టినా కాకులు కూడా ముట్టవన్నారు. ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి, మహబూబాబాద్ ఎంపీ అభ్యర్థి పోరిక బలరాంనాయక్, మాజీ మార్కెట్కమిటీ చైర్మన్పాలాయి శ్రీనివాస్ పాల్గొన్నారు.
మహబూబాబాద్ జిల్లా తొర్రూరులోని రామ ఉపేందర్గార్డెన్స్లో పాలకుర్తి ఎమ్మెల్యే యశస్వినీ రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలోనూ మల్లన్న మాట్లాడారు. పదేండ్లుగా ప్రజల కోసం పోరాడుతున్న తనపై కేసీఆర్100 అక్రమ కేసులు పెట్టి జైల్లో పెట్టించారని, ఇప్పుడు ఆయన బిడ్డ కవితకూ అదే గతి పట్టిందన్నారు. ఆరెకరాల భూమి ఉన్న కేటీఆర్కు ఇప్పుడు 600 ఎకరాలు ఎలా వచ్చిందని ప్రశ్నించారు.
కేటీఆర్20 యూట్యూబ్ఛానల్స్పెట్టి తనను బద్నాం చేయాలని చూస్తున్నాడని, ఆయన మాటలను ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరన్నారు. తనను ఎమ్మెల్సీగా గెలిపిస్తే 2 లక్షల ఉద్యోగాలు గురుకుల టీచర్ల నియామకంతో పాటు, ప్రైవేటు టీచర్లు, ఉద్యోగులకు, 1990 డీఎస్సీ బాధితులకు న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు.
