అట్టడుగు వర్గాలకు న్యాయ సేవలు అందాలె : సీనియర్​ సివిల్ జడ్జి ఉదయభాస్కర్​

అట్టడుగు వర్గాలకు న్యాయ సేవలు అందాలె : సీనియర్​ సివిల్ జడ్జి ఉదయభాస్కర్​

నిజామాబాద్, వెలుగు : న్యాయ చట్టాలపై అవగాహన కల్పించడంతో పాటు అట్టడుగు వర్గాలకు న్యాయ సేవలు అందేలా పని చేస్తున్నామని జిల్లా లీగల్ అథారిటీ సెక్రటరీ, సీనియర్​ సివిల్​ జడ్జి ఉదయభాస్కర్ అన్నారు. సోమవారం లీగల్​ అథారిటీ ఆధ్వర్యంలో మోర్తాడ్ మండలం తిమ్మాపూర్ విలేజ్​లోని కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.

భార్యభర్తలు, అన్నదమ్ముల గొడవలు, సివిల్ కేసులు లోక్​ అదాలత్​లో పరిష్కరించుకునే వీలుందన్నారు. ఇరువర్గాల రాజీతో వాటిని పర్మినెంట్​గా సెటిల్​ చేసుకోవచ్చన్నారు.  ప్రజలకు లీగల్​ సర్వీస్​కు సంబంధించిన కరపత్రాలు పంపిణీ చేశారు. అంతకు ముందు విలేజ్​లోని మోక్షానంద బుద్ద విగ్రహాన్ని జడ్జి విజిట్ చేశారు.