కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ధరణిని తీసివేస్తాం

కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ధరణిని తీసివేస్తాం

కొమురవెల్లి: కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ధరణి పోర్టల్ తీసివేస్తామని కాంగ్రెస్ సీనియర్ నేత పొన్నాల లక్ష్మయ్య తెలిపారు. శనివారం కాంగ్రెస్ రచ్చబండ కార్యక్రమంలో భాగంగా కొమురవెల్లి మండల కేంద్రంలోని కొనుగోలు కేంద్రాన్ని ఆయన పరిశీలించారు. రాష్ట్రంలో కల్లాల వద్ద రైతులు మరణిస్తుంటే.. కేసీఆర్ మాత్రం పంజాబ్ రైతులకు ఆర్థిక సాయం చేయడానికి వెళ్లడం విడ్డూరంగా ఉందన్నారు. వరంగల్ డిక్లరేషన్ ద్వారా రైతులు పండించే పంటకు మద్దతు ధర కల్పించడం తోపాటు కౌలు రైతులకు రుణమాఫీ అమలు చేస్తామన్నారు. కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు పెంచి సామాన్య ప్రజల నడ్డి విరుస్తుందన్నారు. గతంలో మేనిఫెస్టోలో ప్రకటించిన వాగ్దానాలను కాంగ్రెస్ పార్టీ నెరవేర్చిందన్న ఆయన... కేసీఆర్ తాను ఇచ్చిన హామీలను తుంగలో తొక్కారని మండిపడ్డారు. 

మరిన్ని వార్తల కోసం...

ఉజ్వల పథకం సిలిండర్పై రూ. 200 సబ్సిడీ

ఫ్యామిలీతో టూర్ ప్లాన్ చేసిన మహేష్ బాబు