ఏపీ సీఎస్ గా బాధ్యతలు చేపట్టిన నీలం సహాని

ఏపీ సీఎస్ గా బాధ్యతలు చేపట్టిన నీలం సహాని

అమరావతి: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి సీఎస్ గా గురువారం బాధ్యతలు చేపట్టారు సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ నీలం సహాని. సెక్రటేరియట్ లోని ఫస్ట్ బ్లాక్ లో సీఎస్ గా బాధ్యతలు స్వీకరించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ… సీఎం జగన్ మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ఏపీ అభివృద్ధికి పాటుపడతానని చెప్పారు. ప్రభుత్వానికి సర్వీస్ చేయడం తన బాధ్యత అని అన్నారు సహాని. తన మొదటి పోస్టింగ్ కృష్ణాజిల్లా మచిలీపట్నం అని…  రాష్ట్రానికి తిరిగి రావడం ఆనందంగా ఉందని అప్పటి జ్ఞాపకాలు గుర్తుకు వస్తున్నాయన్నారు. అయితే గతంలో కేంద్ర సర్వీసులకు వెళ్లిన సహానీని ఏపీ ప్రభుత్వం రిక్వెస్ట్ మీద రిలీవ్ చేసింది కేంద్రం. సీఎస్ గా బాధ్యతలు చేపట్టిన సహానీని సీనియర్ ఐఏఎస్ అధికారులు అభినందించారు.