
హైదరాబాద్: సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావును ఏపీ పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్లోని ఆయన నివాసానికి వెళ్లిన ఏపీ పోలీసులు తొలుత కొమ్మినేనికి నేరుగా నోటీసులు ఇచ్చారు. అనంతరం ఆయనను అదుపులోకి తీసుకున్నారు. కొమ్మినేని పనిచేస్తున్న ఒక న్యూస్ ఛానల్లో ఆయన ఆధ్వర్యంలో నడిచే ఒక డిబేట్లో అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో ఆయనను పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్ నుంచి విజయవాడకు కొమ్మినేనిని తరలించారు.
తుళ్లూరు పోలీస్ స్టేషన్లో కొమ్మినేని శ్రీనివాస్పై కేసు నమోదైన సంగతి తెలిసిందే. కొమ్మినేనితో పాటు జర్నలిస్ట్ కృష్ణం రాజుపైన కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. అమరావతిని దేవతల రాజధాని అని చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను అపహాస్యం చేసి అవమానకరంగా మాట్లాడారని జర్నలిస్ట్ కృష్ణం రాజుపై ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణం రాజు డీజీపీకి ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.