పదే 10 సినిమాలు చేస్తా.. స్టార్ డైరెక్టర్ సంచలన ప్రకటన

పదే 10 సినిమాలు చేస్తా..  స్టార్ డైరెక్టర్ సంచలన ప్రకటన

తన సినిమాలతో ఒక యూనివర్స్నే క్రియేట్ చేయబోతున్న టాలెంటెడ్ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్(Lokesh Kanagaraj)..

ఖైదీ, విక్రమ్.. సినిమాలతో బాక్సాఫీస్ దగ్గర సరికొత్త రికార్డులను సొంత చేసుకున్న ఈ దర్శకుడు తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. తన యూనివర్స్ లో తీయబోతున్న సినిమాలు పూర్తవగానే ఫిలిం మేకింగ్ కు గుడ్ బై చెప్పేస్తానంటూ ప్రకటించారు. హాలీవుడ్ లెజెండ్ దర్శకుడు క్వింటెన్ టరెంటీనో(Quentin Tarantino) మాదిరి కేవలం 10 సినిమాలు మాత్రమే తీస్తానని ప్రకటించి అభిమానులకి షాక్ ఇచ్చాడు.

లోకేష్ కనకరాజ్ ఫిల్మ్ మేకింగ్ కి అట్రాక్ట్ అయిన ఎంతో మంది అభిమానులకి షాకింగ్ నిర్ణయం అనే చెప్పాలి. 2017లో తమిళంలో విడుదలైన మానగరం సినిమా ద్వారా దర్శకుడిగా సినీరంగంలోకి అడుగుపెట్టి అందరి దృష్టిని ఆకట్టుకున్నారు. తర్వాత వచ్చిన కార్తీ ఖైదీ, కమలహాసన్ విక్రమ్ మూవీస్ తో సరికొత్త రికార్డ్ లని క్రియేట్ చేశారు. ప్రస్తుతం స్టార్ హీరో విజయ్ తో 'లియో' మూవీ చేస్తున్నారు. విజయ్ 67వ చిత్రం కాగా.. ఈ మూవీ రీసెంట్ గానే కశ్మీర్ లో భారీ షెడ్యూల్ ను పూర్తి చేసుకుంది. నెక్స్ట్ షెడ్యూల్ చెన్నై లో షూట్ జరుపుకుంటుంది. విజయ్ కి జోడీగా త్రిష నటిస్తున్నారు.

లియో మూవీ 19 అక్టోబర్ 2023న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానున్నఈ చిత్రానికి సంగీతం అనిరుధ్ రవిచందర్(Anirudh Ravichander), సినిమాటోగ్రఫీ మనోజ్ పరమహంస(Manoj Paramahamsa), ఎడిటింగ్ ఫిలోమిన్ రాజ్(Philomin raj) పని చేస్తున్నారు.

కమల్ హాసన్(Kamal Hasan), రజినీకాంత్(Rajinikanth),దళపతి విజయ్(Dlapathi vijay), సూర్య(Surya), కార్తీ(Karthi),రామ్ చరణ్(Ram Charan) ఇలా స్టార్ హీరోలందరూ లోకేష్ కనకరాజ్ యూనివర్స్ లో భాగమవ్వడానికి రెడీ గా ఉన్నారు.