లాభాల్లో కొనసాగుతున్న స్టాక్ మార్కెట్లు

లాభాల్లో కొనసాగుతున్న స్టాక్ మార్కెట్లు

స్టాక్ మార్కెట్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. రష్యా, ఉక్రెయిన్ మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల కారణంగా గత సెషన్లో భారీగా నష్టపోయిన మార్కెట్లు ఇవాళ తేరుకున్నాయి. ఆసియా మార్కెట్లు సానుకూలంగా ఉండటం, ఇన్వెస్టర్లు కనిష్ఠ స్థాయి వద్ద కొనుగోళ్లకు మొగ్గుచూపడం మార్కెట్కు కలిసొచ్చింది. 10గంటల సమయంలో సెన్సెక్స్ 230 పాయింట్లకుపైగా లాభంతో 57,538 పాయింట్ల వద్ద కొనసాగుతోంది. కొటక్ మహీంద్రా, ఇండస్ ఇండ్ బ్యాంక్, టైటాన్, ఏషియన్ పెయింట్స్, మారుతి, బజాజ్ ఫైనాన్స్ షేర్లు ప్రాఫిట్లో ఉన్నాయి. నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ సూచీ నిఫ్టీ 55పాయింట్లకుపైగా లాభంతో 17,145 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది.