స్టాక్ మార్కెట్లో బుల్ రన్

స్టాక్ మార్కెట్లో బుల్ రన్

స్టాక్ మార్కెట్లో బుల్ జోష్  కనిపిస్తోంది. వరుసగా మూడో రోజు మార్కెట్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు మొగ్గుచూపడం మార్కెట్ లో జోష్ నింపింది. బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ సూచీ 480 పాయింట్లకు పైగా లాభంతో 57,430 వద్ద కొనసాగుతోంది. బజాజ్ ఫైనాన్స్, ఐటీసీ, విప్రో, రిలయన్స్, టీసీఎస్ షేర్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి. నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ సూచీ నిఫ్టీ 135 పాయింట్లకుపైగా ప్రాఫిట్ తో 17,090 వద్ద ట్రేడవుతోంది.