
న్యూఢిల్లీ: వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు నడుపుతున్న సుమారు 1,600 పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ (పీఎస్యూల)ను త్వరగా, సమర్ధవంతంగా ఆడిట్ చేయడానికి ప్రత్యేక యూనిట్ ఏర్పాటు చేశామని భారత కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) ప్రకటించింది. “ఇటీవలే ప్రత్యేక విభాగాన్ని క్రియేట్ చేశాం. ఆర్డర్ జారీ చేశాం. ఈ వెర్టికల్ స్టార్ట్ అయ్యాక, ఒక రాష్ట్రంలోని పీఎస్యూఈలను ఆడిట్ చేయడానికి ఒక ప్రత్యేక గ్రూప్ ఏర్పాటవుతుంది” అని డిప్యూటీ కాగ్ కె.ఎస్.
సుబ్రమణియన్ (హెచ్ఆర్) చెప్పారు. రాష్ట్రల కంట్రోల్లోని పీఎస్యూలను త్వరగా ఆడిట్ చేయడానికి, పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ సమర్ధతను పెంచడానికి ఇది సాయపడుతుందని అని వివరించారు. సెంట్రల్ పబ్లిక్ సెక్టార్ ఎంటర్ప్రైజెస్ (సీపీఎస్ఈల)ను ఆడిట్ చేసేందుకు సపరేట్ యూనిట్ పని చేస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం సీనియర్ మేనేజ్మెంట్ స్టేట్ పీఎస్యూలను ఆడిట్ చేస్తోంది.
4–5 రాష్ట్రాల పీఎస్యూలను ఆడిటింగ్ చేయాల్సి వస్తోంది. దీనికి టైమ్ ఎక్కువ పడుతోందని సుబ్రమణియన్ అన్నారు. ప్రస్తుతం 700 కేంద్ర ప్రభుత్వ కంపెనీలు, 1,600 రాష్ట్ర ప్రభుత్వాల కంపెనీలు, 485 సెంట్రల్ ఆటోనమస్ బాడీస్ , 700 కి పైగా స్టేట్ ఆటోనమస్ బాడీస్ ఉన్నాయి.