Nainisha Rai: రక్తం అమ్ముకొని బ్రతికాను.. కన్నీళ్లు పెట్టుకున్న సీరియల్ నటి నైనీషా

Nainisha Rai: రక్తం అమ్ముకొని బ్రతికాను.. కన్నీళ్లు పెట్టుకున్న సీరియల్ నటి నైనీషా

నటి నైనీషా రాయ్(Nainisha Rai) ఎవరూ గుర్తుపట్టక పోవచ్చు కానీ, బ్రహ్మముడి(Brahmamudi) సీరియల్ లో అప్పు(Appu) అంటే మాత్రం టక్కున గుర్తుపట్టేస్తారు. ఆ సీరియల్ లో తన క్యూట్ నటనతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది నైనీషా. అవడానికి బెంగాలీ అయినా అచ్చం తెలుగమ్మాయిలా కనిపించి తెలుగులో చాలా మంది అభిమానులను సంపాదించుకుంది. అయితే.. ఆమె నటిగా అవకాశాలు అందుకోవడానికి ముందు చాలా ఇబ్బందులు పడిందట. కనీసం తినడానికి కూడా డబ్బులు ఉండేవి కావట. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె తన సినీ జీవితం ఎలా సాగిందో చెప్తూ కన్నీళ్లు పెట్టుకుంది. 

ఇండస్ట్రీలో అడుగుపెట్టిన కొత్తలో తినడానికి తిండి కూడా ఉండేది కాదు. ఒక సమయంలో ఆకలి తీర్చుకునేందుకు రక్తాన్ని కూడా అమ్ముకోవాల్సి వచ్చింది. అలా కష్టాలు పడుతున్న సమయంలో ఆఫర్లు వచ్చాయి కానీ, నీకు అవకాశం ఇస్తే మాకేంటి అని అడిగేవారు. కమిట్‌మెంట్‌ కండీషన్స్ పెట్టేవారు. కొన్నిసార్లు బలవంతం పెట్టారు కూడా.. కానీ, అక్కడినుండి ఎలాగోలా బయటకు వచ్చేశాను. ఇంటికి తిరిగికూడా వెళ్ళలేను. ఒకవేళ వెళ్లినా.. రానివ్వరు కూడా. ఎందుకంటే.. వాళ్లకి ఇష్టం లేకుండా బయటకు వచ్చేశాను కాబట్టి. ఒకానొక సమయంలో చనిపోదామని కూడా అనుకున్నాను... అంటూ కన్నీళ్లు పెట్టుకుంది నైనీషా.

also read : Rituraj Singh: ప్రముఖ నటుడు రీతురాజ్ సింగ్ కన్నుమూత

అన్ని కష్టాలని దాటుకొని ఇప్పుడు ఈస్థాయిలో ఉన్నాను అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం నైనీషాకు సంబందించిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక నైనీష సీరియల్స్ విషయానికి వస్తే.. ప్రస్తుతం నటిస్తున్న బ్రహ్మముడితో పాటు.. కలిసి ఉంటే కలదు సుఖం, వంటలక్క, భాగ్య రేఖ, ఇంటిగుట్టు, హంసగీతం శ్రీమంతుడు వంటి సీరియల్స్ లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది నైనీషా రాయ్.