మేడ్చల్‎ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం: రెండు ముక్కలైనా ట్రాక్టర్.. డ్రైవర్ స్పాట్ డెడ్

మేడ్చల్‎ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం: రెండు ముక్కలైనా ట్రాక్టర్.. డ్రైవర్ స్పాట్ డెడ్

హైదరాబాద్: మేడ్చల్ జిల్లా శామీర్ పేట పోలీస్ స్టేషన్ పరిధిలోని అలియాబాద్ చౌరస్తా దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అలియాబాద్ నుంచి శామీర్ పేట వైపు వెళ్తున్న ట్రాక్టర్‎ను శామీర్ పేట నుంచి వస్తున్న లారీ ఢీకొట్టింది. ట్రాక్టర్ అదుపు తప్పి  రాంగ్ రూట్‎లోకి వెళ్లడంతో ఈ ప్రమాదం జరిగింది.

ఈ ఘటనలో మహారాష్ట్రకు చెందిన ట్రాక్టర్ డ్రైవర్ ఆకాష్ (30) అక్కడికక్కడే మృతి చెందాడు. ప్రమాద ధాటికి ట్రాక్టర్ ఇంజన్ రెండు ముక్కలైంది. ఈ ప్రమాదంతో రాజీవ్ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఇరువైపుల కిలో మీటర్ల మేర 
వాహనాలు నిలిచిపోయాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని సహయక చర్యలు చేపట్టారు. 

రోడ్డుకు అడ్డంగా ఉన్న ట్రాక్టర్‎ను క్రేన్ సహయంతో పక్కకు తొలగించి ట్రాఫిక్‎ను క్లియర్ చేశారు. ఘటన స్థలాన్ని పరిశీలించి ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. డ్రైవర్ మృతదేహాన్ని పోస్ట్ మార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.