జూన్‌ నుంచి పది కోట్ల టీకాలు అందిస్తాం

జూన్‌ నుంచి పది కోట్ల టీకాలు అందిస్తాం

దేశంలో కరోనా టీకాల కొరత తీవ్రంగా ఉంది. అయితే ఇకపై అలాంటి ఇబ్బంది కలగకుండా ..తగినన్ని వ్యాక్సిన్లను అందిస్తామని తెలిపింది సీరం ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా (SII). జూన్‌లో 9 నుంచి 10 కోట్ల కొవిషీల్డ్ టీకాలు ఇస్తామంటూ కేంద్ర మంత్రి అమిత్ షాకు లేఖ రాసింది. జూన్ నెల నుంచే 10 కోట్ల టీకాలు ఇస్తామని చెప్పేందుకు సంతోషిస్తున్నామని ఆ లేఖలో చెప్పింది. వ్యాక్సిన్ల ఉత్పత్తిని పెంచేందుకు తమ సిబ్బంది 24 గంటలూ పనిచేస్తున్నారని తెలిపింది.

జూన్‌లో 6.5 కోట్లు, జులైలో 7 కోట్లు, ఆగస్టు, సెప్టెంబరులో 10 కోట్ల చొప్పున టీకాలను ఉత్పత్తి చేసి సరఫరా చేస్తామని సీరం గతంలో ప్రకటించింది. అయితే..జూన్‌లోనే తన ఉత్పత్తి సామర్థ్యాన్ని 10 కోట్లకు పెంచనుంది. మేలో 6.5 కోట్ల వ్యాక్సిన్ డోసులను మాత్రమే సీరం ఉత్పత్తి చేయగలిగింది. దీన్ని దశల వారీగా పెంచుతూ ఆగస్టు, సెప్టెంబరు నాటికి పది కోట్ల వ్యాక్సిన్ డోసులకు ఉత్పత్తిని పెంచాలని నిర్ణయించినట్టు గతంలో తెలిపింది. అయితే, అనుకున్న దానికి రెండు, మూడు నెలల ముందుగానే 10 కోట్ల టీకాలను సరఫరా చేస్తామని సీరం చెప్పింది.