అమ్మాయిని వేధించిన కేసులో మూడేండ్ల జైలు శిక్ష : సెషన్స్​కోర్టు

అమ్మాయిని వేధించిన కేసులో మూడేండ్ల జైలు శిక్ష : సెషన్స్​కోర్టు

శంకర్ పల్లి, వెలుగు :  ఓ అమ్మాయిని వేధించిన కేసులో నిందితుడికి మూడేళ్ల జైలు శిక్ష, రూ. 10 వేల ఫైన్  విధిస్తూ చేవెళ్ల అడిషనల్​ సెషన్స్​కోర్టు బుధవారం తీర్పు చెప్పింది.  శంకర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పల్లి డీఐ నాగరాజు తెలిపిన ప్రకారం..  2019లో  ఒక అమ్మాయిని వికారాబాద్​ జిల్లా మర్పల్లికి చెందిన  శ్రీరాంరెడ్డి(29) వేధించాడు.  బాధిత యువతి కుటుంబసభ్యులు శంకర్​పల్లి పీఎస్​లో కంప్లయింట్ చేశారు.

విచారణ చేపట్టిన చేవెళ్ల అడిషనల్​ సెషన్స్​ కోర్టు నిందితుడికి  జైలు శిక్షతో పాటు,  జరిమానా విధించినట్లు తెలిపారు.  కేసు విచారణలో చొరవ చూపిన ఎస్సై లక్ష్మినారాయణ, సీఐ వినాయక్​ రెడ్డి, కానిస్టేబుల్​ శ్రీనివాస్​ రాజేంద్రనగర్​ డీసీపీ, నార్సింగి ఏసీపీ  అభినందించారు.