పెను విషాదం.. ఆర్సీబీ గెలుపు సంబరాల్లో తొక్కిసలాట.. పది మంది మృతి.. అసలు తొక్కిసలాటకు కారణాలేంటి..?

పెను విషాదం.. ఆర్సీబీ గెలుపు సంబరాల్లో తొక్కిసలాట.. పది మంది మృతి.. అసలు తొక్కిసలాటకు కారణాలేంటి..?

పేరుకు చిన స్వామి స్టేడియం అయినా.. పెద్దగా వచ్చిన జనంతో విజయోత్స ర్యాలీ విషాదంగా మారింది. అహ్మదాబాద్ లో ఐపీఎల్ కప్ గెలిచిన బెంగళూరు క్రికెట్ జట్టు.. స్వరాష్ట్రంలో అడుగుపెట్టిన క్షణం విషాదాన్ని నింపింది. ఆర్బీసీ జట్టు విజయోత్సవ ర్యాలీ తర్వాత బెంగళూరులోని చిన్నస్వామి క్రికెట్ స్టేడియంలో గ్రాండ్ సన్మానం ఏర్పాటు చేసింది కర్నాటక ప్రభుత్వం. దీంతో ఆర్సీబీ జట్టును చూసేందుకు లక్షల మంది జనం.. ర్యాలీ వెంట పరుగులు తీస్తూ.. క్రికెట్ స్టేడియానికి పోటెత్తారు. స్టేడియం సామర్థ్యానికి మంచి ఫ్యాన్స్ రావటంతో.. స్టేడియం లోపలికి దూసుకెళ్లటంతో తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాటలో పది మంది ఆర్సీబీ అభిమానులు చనిపోయారు. మరో 30 మంది వరకు గాయపడినట్లు సమాచారం.

పోలీస్ భద్రత ఉన్నా.. ముందస్తు ఏర్పాట్లు చేసినా.. ఊహించని విధంగా అభిమానులు రావటం.. స్టేడియంలోకి దూసుకెళ్లేందుకు పోటీపడటం.. గోడలు ఎక్కి.. గేట్లు ఎక్కి స్టేడియంలోకి వెళ్లటానికి ప్రయత్నించటంతో గందరగోళం నెలకొంది. వచ్చినోళ్లు అందరూ కుర్రోళ్లు.. అందులోనూ క్రికెట్ పిచ్చిలో ఉన్నారు.. పోలీసులు ఎంత చెప్పినా.. మైకుల్లో అనౌన్సులు చేస్తున్నా వినలేదు.. ఎక్కడికక్కడ తోసుకుంటూ ముందుకు వచ్చారు. ఈ క్రమంలోనే.. క్రికెట్ స్టేడియం గేట్ల దగ్గర తొక్కిసలాట జరిగింది. ఇందులో పది చనిపోగా.. 30 మంది గాయపడ్డారు. 

ఈ తొక్కిసలాట ఘటన తర్వాత క్రికెట్ స్టేడియం గేట్లు మూసివేసి.. లాఠీఛార్జి చేసి అభిమానులను చెదరగొట్టారు. స్టేడియం వైపు ఎవరూ రావొద్దని.. ఇప్పటికే స్టేడియం ఫుల్ అయ్యిందని ప్రకటించారు పోలీసులు. క్రికెట్ ఫ్యాన్స్ ఎక్కువగా వస్తారని ముందుగానే తెలిసినా.. సరైన ఏర్పాట్లు చేయలేదనే విమర్శలు కూడా ఉన్నాయి. ఆర్సీబీ విజయోత్సవ సంబరాలు బెంగళూరులో పెను విషాదానికి దారి తీయడంతో స్టేడియం ముందు హృదయ విదారక దృశ్యాలు కనిపించాయి. తొక్కిసలాటలో ఊపిరాడక కొందరు, గాయపడి కొందరు.. ఇలా చిన స్వామి ముందు ఆర్తనాదాలు, హాహాకారాలు చేశారు. స్టేడియం లోపల మాత్రం ఆర్సీబీ గెలుపు సంబరాలు జరుగుతూనే ఉండటం గమనార్హం.

చిన స్వామి స్టేడియం తొక్కిసలాట లేటెస్ట్ అప్డేట్స్:
* బెంగళూరులో పెను విషాదంగా ఆర్సీబీ గెలుపు సంబరాలు
* చిన స్వామి స్టేడియం దగ్గర తొక్కిసలాటలో 10 మంది మృతి
* చనిపోయిన 10 మందిలో ఆరుగురు యువకులు, ఒక చిన్నారి, ముగ్గురు యువతులు
* తొక్కిసలాట కారణంగా ఊపిరాడక 27 మంది ఆసుపత్రుల్లో చేరిక
* 19 మంది బౌరింగ్ హాస్పిటల్కు, 8 మందిని విట్టల్ మాల్యా రోడ్లోని వైదేహి ఆసుపత్రికి తరలింపు
* చిన స్వామి స్టేడియానికి పోటెత్తిన ఆర్సీబీ అభిమానులు
* అభిమానులను కట్టడి చేయలేకపోయిన పోలీసులు
* స్టేడియం దగ్గర డ్యూటీలో 5 వేల మంది పోలీసులు.. వేలల్లో తరలివచ్చిన ఆర్సీబీ అభిమానులు