మధ్యప్రదేశ్లో దారుణం

మధ్యప్రదేశ్లో దారుణం

మధ్యప్రదేశ్లో దారుణం జరిగింది. నాలుగు రోజుల క్రితం ఓ చిన్నారి బోరుబావిలో పడగా.. తాజాగా అలాంటి ఘటనే మరొకటి చోటు చేసుకుంది. దామోహ్ జిల్లాలోని బర్కేడా గ్రామానికి చెందిన ప్రియాంశ్ అనే ఏడేళ్ల బాలుడు ఆడుకుంటూ ప్రమాదవశాత్తూ 300 అడుగుల లోతైన బోరు బావిలో పడ్డాడు. ప్రస్తుతం ఆ చిన్నారిని బయటకు తీసే ప్రయత్నాలు జరగుతున్నాయి. అందుకోసం బోరుబావికి సమాంతరంగా గుంత తొవ్వుతున్నారు. బాలుడు 10 నుంచి 15 ఫీట్ల లోతులో చిక్కుకుపోయినట్లు అధికారులు గుర్తించారు. జిల్లా అధికారులతో పాటు పోలీస్, వైద్య సిబ్బంది ఘటనాస్థలంలోనే ఉండి నిరంతరం పరిస్థితిని సమీక్షిస్తున్నారు. పైప్ ద్వారా బోరుబావులోకి ఆక్సిజన్ పంపుతున్నారు.  

ఉమైరా జిల్లాలో గురువారం మూడేళ్ల బాలుడు 200 ఫీట్ల లోతు బోరుబావిలో పడిపోయాడు. దాదాపు 16 గంటల పాటు శ్రమించి చిన్నారిని బయటకు తీసినా ఫలితం లేకుండాపోయింది. ఆలస్యం కావడంతో బాలుడు మృతిచెందాడు.

For more news..

ఏ దేశం చేయని గొప్ప కార్యక్రమం భారత్ చేసింది

మణిపూర్లో రేపే తొలి విడత పోలింగ్