ఢిల్లీ మెట్రోలో మహిళలపై ఆకతాయిలు లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారు. 2016 నుంచి ఆ కేసులు 43 శాతం పెరిగాయి. సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్ఎఫ్) డేటా చెబుతున్న చేదు నిజం ఇది. ఢిల్లీ మెట్రో భద్రతా బాధ్యతలను చూస్తున్న సీఐఎస్ఎఫ్కు ఈ ఏడాది ఆరు నెలల్లోనే లైంగిక వేధింపులపై 110 ఫిర్యాదులు అందాయి. గత మూడేళ్లలో ఏడాది పాటు వచ్చిన కేసులతో పోలిస్తే ఇది చాలా ఎక్కువ. 2016లో 77, 2017లో 87, 2018లో 86 చొప్పున లైంగిక వేధింపుల కేసులు నమోదయ్యాయి. ఎక్కువ కేసులు రిపోర్ట్ అవుతున్నది జనరల్ బోగీల నుంచేనని పేరు చెప్పడానికి ఇష్టపడని ఓ అధికారి చెప్పారు. ఫిర్యాదుల్లో ఎక్కువగా అసభ్యకరంగా తాకడం, మీదపడి నెట్టేయడం, మీదిమీదికి దూసుకురావడం వంటివే ఎక్కువున్నాయన్నారు. అవి కూడా పీక్ టైం అయిన ఉదయం 8 నుంచి 11 గంటలు, సాయంత్రం 5 నుంచి 8 గంటల మధ్యే జరుగుతున్నాయని ఆ అధికారి చెప్పారు. బాధితులు ధైర్యంగా ముందుకొచ్చి ఫిర్యాదు చేయడం వల్లే ఈ ఏడాది కేసులు ఎక్కువగా ఉన్నాయని సీఐఎస్ఎఫ్ అసిస్టెంట్ ఇన్స్పెక్టర్ జనరల్ హేమేంద్ర సింగ్ వివరించారు. వచ్చిన ఫిర్యాదుల్లో 18 ఎఫ్ఐఆర్లు నమోదు చేశామని, నిందితులందరినీ అరెస్ట్ చేశామని ఢిల్లీ మెట్రో రైల్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ మహ్మద్ అలీ చెప్పారు. అన్ని సందర్భాల్లోనూ కేసులు నమోదు చేయట్లేదని, స్పాట్లో వాళ్లకు కౌన్సిలింగ్ ఇచ్చి బుద్ధి చెప్పి పంపిస్తున్నామని హేమేంద్ర సింగ్ తెలిపారు. ఢిల్లీ మెట్రోలో రోజూ సగటున 27 లక్షల మంది ప్రయాణిస్తున్నారు.
ఢిల్లీ మెట్రోలో లైంగిక వేధింపులు
- దేశం
- July 27, 2019
లేటెస్ట్
- Women's T20 World Cup 2024: ఒకే గ్రూప్లో ఇండియా, పాక్.. టీ20 ప్రపంచ కప్ 2024 షెడ్యూల్ విడుదల
- V6 DIGITAL 05.05.2024 AFTERNOON EDITION
- PBKS vs CSK: పంజాబ్తో హైవోల్టేజ్ మ్యాచ్.. పదోసారి టాస్ ఓడిన చెన్నై
- బీఆర్ఎస్ లీడర్లను కాంగ్రెస్లో చేర్చుకోండి.. వద్దనకండి: రాజగోపాల్ రెడ్డి
- మా సమస్యలు తీరిస్తేనే ఓటేస్తాం.. బెట్టు చేస్తున్న ఓటర్లు..
- A1గా చంద్రబాబు, A2గా లోకేష్.. కేసు నమోదు చేసిన సీఐడీ...
- పదేండ్లలో రాష్ట్రానికి బీఆర్ఎస్, బీజేపీ చేసిందేమీ లేదు : వివేక వెంకట్వామి
- వైరా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద ఉద్రిక్తత
- అధికారంలోకి వస్తే దేశమంతా తెలంగాణ హామీలు అమలు : రాహుల్ గాంధీ
- ఆడబిడ్డకు ఎంపీగా ఛాన్స్ ఇవ్వండి: సీఎం రేవంత్ రెడ్డి
Most Read News
- చల్లటి కబురు : సోమవారం నుంచి తెలంగాణలో ఐదు రోజులు వానలు
- GT vs RCB: గుజరాత్తో కీలక మ్యాచ్.. టాస్ గెలిచిన బెంగళూరు
- రైల్వేను కూడా : కేరళ ఫస్ట్ ప్రైవేట్ రైలు వచ్చేస్తోంది..
- ఇయ్యాల హైదరాబాద్ లో ట్రాఫిక్ ఆంక్షలు
- అలర్ట్.. మే 5న శంషాబాద్ పరిధిలో ట్రాఫిక్ ఆంక్షలు
- ఊటీనా తొక్కా.. అక్కడ కూడా ఎండ మండిపోతుంది
- బతికేది ఎట్టా: 4 నెలలు.. 279 కంపెనీలు.. 80వేల మంది ఐటీ ఉద్యోగులను తీసేశాయ్
- IPL 2024: డేవిడ్ వార్నర్ 70 శాతం భారతీయుడు: ఆస్ట్రేలియా క్రికెటర్
- Weather Alert: ఏపీ ప్రజలు జాగ్రత్త.. ఆదివారం తీవ్ర వడగాలులు
- GT vs RCB: కోహ్లీ, డుప్లెసిస్ బాదుడే బాదుడు.. బెంగుళూరు చేతిలో చిత్తయిన గుజరాత్