టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత నటిస్తోన్న తాజా చిత్రం ‘శాకుంతలం’ కొత్త రిలీజ్ డేట్ వచ్చింది. ఏప్రిల్ 14న మూవీని రిలీజ్ చేయనున్నట్టుగా మేకర్స్ ప్రకటించారు. గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీని ముందుగా ఫిబ్రవరి 17న రిలీజ్ చేయాలని అనుకున్నారు. కానీ కొన్ని అనివార్య కారణల వలన వాయిదా పడింది. తాజాగా కొత్త రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేశారు. ఇందులో సమంత శకుంతలగా కనిపించనుండగా దుష్యంతుడిగా దేవ్ మోహన్ నటించారు. మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీతం అందించిన ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత దిల్ రాజు సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, గుణ టీమ్ వర్క్స్ పతాకాలపై నీలిమ గుణ నిర్మించారు. ఇప్పటికే రిలీజైన ట్రైలర్, సాంగ్స్ సినిమాపై భారీ అంచనాలను క్రియెట్ అయ్యాయి. తెలుగుతో పాటుగా హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో కూడా ఈ చిత్రం విడుదల కానుంది.