పిట్లం బస్టాండ్​లో ప్రయాణికులకు నీడ సౌకర్యం

పిట్లం బస్టాండ్​లో ప్రయాణికులకు నీడ సౌకర్యం

బస్టాండ్​ రిపేర్​ నేపథ్యంలో ప్రయాణికులకు పట్టించుకోకపోవడంతో వెలగులో సోమవారం వచ్చిన ‘బస్టాండ్​ కూల్చి  ఎండలో నిల్చొబెట్టి’ కథనానికి ఆర్టీసీ అధికారులు స్పందించారు. మంగళవారం బస్టాండ్​ ఆవరణలో  టెంట్ ఏర్పాటు చేశారు. శిథిలావస్థకు చేరిన పిట్లం బస్టాండ్​ రిపేర్​ కోసం నెల రోజుల కింద కూల్చి వేశారు.

ప్రయాణికులకు నీడ సౌకర్యం కల్పించకుండా వదిలేయడంతో ఇబ్బంది పడుతున్నారు. దీనిపై వెలుగులో కథనం రావడం.. సమస్య పరిష్కారం కావడంపై ప్రయాణికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ - పిట్లం, వెలుగు